యాప్నగరం

TS: బాగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా మరో ఇద్దరి మృతి

Coronavirus in Telangana: తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 30,376 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 317 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 67 లక్షలకు చేరువైంది.

Samayam Telugu 26 Dec 2020, 9:28 am
తెలంగాణలో శుక్రవారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. శుక్రవారం మొత్తం 317 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,391 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 6,618గా ఉన్నాయి. వీరిలో 4,535 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 536 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక శుక్రవారం మరో ఇద్దరు కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1529కి చేరింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Corona treatment


శుక్రవారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ కొన్ని కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 71 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే కాక, అన్ని జిల్లాల్లో కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గుతుండడం ఊరట కలిగిస్తోంది.

మరోవైపు, తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 30,376 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 317 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 67 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 384 మంది ఫలితాలు తేలాల్సి ఉంది. పూర్తి హెల్త్ బులెటిన్ కోసం కింది పీడీఎఫ్ క్లిక్ చేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.