యాప్నగరం

మద్యం మార్గదర్శకాలు.. ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే జైలుకే

Telangana Wines: తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేయనుంది. ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం విక్రయిస్తే ఆర్నెళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించనుంది.

Samayam Telugu 16 Oct 2019, 8:23 pm
రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. నవంబర్ 1 నుంచి మద్యం షాపుల్లో నూతన క్రయ విక్రయాలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయనుంది. సిండికేట్లను నిలువరించడానికే కఠిన నిబంధనలను తీసుకొచ్చినట్లు ఎక్స్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
Samayam Telugu liquor


ఏ-4 రకం మద్యం షాపుల టెండర్ల ప్రక్రియలో సిండికేట్‌గా ఏర్పడేందుకు దరఖాస్తుదారులను కొంతమంది కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఆ అంశంపై వచ్చిన ఫిర్యాదులను ఎక్సైజ్‌ శాఖ అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టారు.

Don't Miss: మందు తాగి, స్టఫ్ తిని.. సూర్యాపేటలో కొండంగి వింత చేష్టలు

మద్యం సిండికేట్ల రూపంలో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా అనైతిక మార్గాల్లో వ్యాపారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. లైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే తెలంగాణ ఎక్సైజ్ చట్టం 36 బీ, 41ల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేట్లకు మందు అమ్మి వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అలాంటి వారికి చట్ట ప్రకారం 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించనున్నారు. ఎక్సైజ్‌ శాఖకు అదనంగా రూ.2 నుంచి 3 లక్షల అపరాధ రుసుము కట్టేలా నిబంధనలు రూపొందించారు.

Also Read: ఏళ్లుగా ఏంటిది.. ఆర్టీసీ సమ్మెపై తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.