యాప్నగరం

సెకండ్ షిప్ట్ డ్యూటీకి వెళ్లిన భర్త.. వచ్చేసరికి భార్య ఏం చేసిందంటే

పెళ్లైన మూడు నెలలకు భర్తకు భార్య షాక్ ఇచ్చింది. ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Samayam Telugu 4 Dec 2020, 9:12 am
ఈమధ్య కొందరు చిన్న చిన్న కారణాలకే ప్రాణం తీసుకుంటున్నారు. ముఖ్యంగా భార్య భర్తలు, విద్యార్థులు, యువతీ యువకులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. చిన్నపాటి గొడవలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నవవధువు ఆత్మమత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే నూతన వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన పటాన్‌చెరువు మండలం చిట్కుల్ గ్రామంలో చోటు చేసుకుంది.
Samayam Telugu నవవధువు ఆత్మహత్య


Read More: తెలంగాణలో మరో పరువు హత్య.. కూతుర్ని ప్రేమించాడని

వివారాల్లోకి వెళ్తే.. గ్రామం లోని నాగార్జున నగర్ కాలనీ లో సుకన్య ( 26) ఆత్మహత్యకు పాల్పడింది. రాఘవేంద్ర అనే వ్యక్తి గత మూడు నెలల క్రితం మహబూబ్ నగర్ చెందిన సుకన్య తో వివాహం జరిగింది. నిన్ళ మధ్యాహ్నం భర్త రాఘవేంద్ర సెకండ్ షిప్ట్ డ్యూటీకి వెళ్లి రాత్రికి ఇంటికి చేరుకున్నాడు. అయితే రాఘవేంద్ర వచ్చేసరికి భార్య సుకన్య డోర్ లాక్ చేసుకుని ఉంది. ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన భర్త రాఘవేంద్ర కిటికీలోంచి చూశాడు. దీంతో భార్య ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.