యాప్నగరం

ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని అణువణువూ పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

Shadnagar Encounter ప్రాంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పరిశీలించారు. పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Samayam Telugu 8 Dec 2019, 12:18 am
షాద్‌నగర్ చటాన్‌పల్లిలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ స్పాట్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) బృందం పరిశీలించింది. శనివారం (డిసెంబర్ 7) రాత్రి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు అణువణువూ పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలికి వెళ్లారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం మొత్తాన్ని కాలినడకన తిరిగి పరిశీలించారు. దిశ మృతదేహాన్ని నిందితులు దహనం చేసిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. అంతకుముందు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దిశ కేసులో నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించారు.
Samayam Telugu ఎన్‌హెచ్‌ఆర్సీ


నిందితుల కుటుంబ సభ్యులతోనూ ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు మాట్లాడారు. సుమారు 3 గంటలకు పైగా మహబూబ్‌నగర్ ఆస్పత్రిలోనే ఉన్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం చటాన్‌పల్లిలో దిశ ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Also Read: అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి.. పోలీసుల పరిస్థితి ఏంటి?

షాద్‌నగర్ ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపేందుకు ఢిల్లీ నుంచి ఓ టీమ్‌ను పంపించారు. శనివారం ఉదయం ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.