యాప్నగరం

నితిన్ భీష్మ చిత్రం ఆర్టీసీ బస్సులో ప్రసారం.. మంత్రి కేటీఆర్ సీరియస్

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. అయితే, అన్ని సినిమాల్లాగే ఈ చిత్రమూ పైరసీ బారిన పడింది. అది కూడా తెలంగాణ ఆర్టీసీ బస్సులో కావడం గమనార్హం. హైదరాబాద్ నుంచి జిల్లాలకు నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని బస్సుల్లో భీష్మ సినిమాను ప్రసారం చేసినట్లుగా ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఖమ్మం వెళ్తున్న రాజధాని ఏసీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోను భీష్మ చిత్ర టీమ్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

Samayam Telugu 28 Feb 2020, 11:47 am
యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. అయితే, అన్ని సినిమాల్లాగే ఈ చిత్రమూ పైరసీ బారిన పడింది. అది కూడా తెలంగాణ ఆర్టీసీ బస్సులో కావడం గమనార్హం. హైదరాబాద్ నుంచి జిల్లాలకు నడిచే సూపర్ లగ్జరీ, రాజధాని బస్సుల్లో భీష్మ సినిమాను ప్రసారం చేసినట్లుగా ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఖమ్మం వెళ్తున్న రాజధాని ఏసీ బస్సులోని టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోను భీష్మ చిత్ర టీమ్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
Samayam Telugu nithin movie bheeshma telecasts in tsrtc buses ktr reacts seriously
నితిన్ భీష్మ చిత్రం ఆర్టీసీ బస్సులో ప్రసారం.. మంత్రి కేటీఆర్ సీరియస్


కేటీఆర్‌కు ట్వీట్

దీనిపై హీరో నితిన్ తక్షణం స్పందించి ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్‌లోని పైరసీ వ్యతిరేక విభాగం దృష్టికి తెచ్చారు. ఆ విభాగం ప్రతినిధులు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ఈనెల 21న విడుదలకాగా.. విడుదలైన నాలుగో రోజే ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారని, ఇతర మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తరించకుండా చర్యలు చేపట్టాలని వారు పోలీసులను కోరారు. అంతేకాకుండా, చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల కూడా ఓ ట్వీట్ చేశారు. ‘‘ఆఖరికి పైరసీ సినిమాలు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రసారమవుతున్నాయి. ఇది చాలా విచారకరం. మాకు ఏ సమస్య వచ్చినా ట్యాగ్ చేయాలనిపించే వ్యక్తి ఒకే ఒక్క ఐడీ కేటీఆర్ గారిది. అందుకే మీకు ట్యాగ్ చేస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

మంత్రి సీరియస్

అయితే, ఈ ట్వీట్‌పై మరో యువ హీరో నిఖిల్ కూడా స్పందించారు. కొద్ది నెలల క్రితం అర్జున్ సురవరం సినిమా పైరసీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రసారం చేశారని ఆ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో దర్శకుడు వెంకి కుడుముల చేసిన ట్వీట్ట్‌పై, కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్‌లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కు సూచించారు. అంతేకాక, పైరసీ అడ్డుకట్టకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Must Read: చనిపోతున్న వేలాది కోళ్లు.. భారీగా తగ్గిన చికెన్ డిమాండ్.. ‘కరోనా’ కారణమా?

Twitter-Nikhil Fan Boy _ venkat

Twitter-Venky Kudumula

Twitter-KTR

Twitter-Nikhil Siddhartha

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.