నిజాం రహస్య నిధుల కోసమే సచివాలయం కూల్చివేత.. రేవంత్ సంచలన ఆరోపణలు
Telangana Secretariat Demolition: సచివాలయం కూలగొట్టేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వచ్చిన రోజు నుంచి మళ్లీ స్టే విధించడం వరకూ 11 రోజుల పాటు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ ప్రశ్నించారు.
Samayam Telugu 14 Jul 2020, 9:38 pm
పాత సచివాలయ భవనాలను కూలగొట్టడం అర్ధరాత్రి సమయంలో మొదలు పెట్టడం ఏంటని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. అంతకుముందు రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సుదీర్ఘ భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన వారితో మాత్రమే దీని గురించి చర్చించి సచివాలయం కూలగొట్టడాన్ని మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. సచివాలయం చుట్టూ 3 కిలో మీటర్ల మేర కఠిన నిషేదాజ్ఞలు విధించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సచివాలయం చుట్టూ ఎలాగూ ఎత్తైన ప్రహరీ గోడ ఉందని, పక్కన రోడ్లపై వాహనాలను అనుమతించినా జరిగే నష్టం ఏం ఉండబోదని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సచివాలయం కూలగొట్టేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వచ్చిన రోజు నుంచి మళ్లీ స్టే విధించడం వరకూ 11 రోజుల పాటు ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ ప్రశ్నించారు.
‘సీఎం ఎందుకు కనిపించలేదు?’
‘నిజాం నిధులు ఉన్నందుకే ఈ రహస్యమా’
సచివాలయం కింద సొరంగాల్లో నిధులు
కోర్టు సుమోటోగా తీసుకోవాలి: రేవంత్
Must Read: గాంధీలో మరో ఘోరం.. 8గంటలు అక్కడే కరోనా శవం? వార్డులో దుర్వాసన