యాప్నగరం

KTR పిలుపు.. రక్తదానం చేసిన కవిత

TRS పార్టీ కీలక నాయకురాలు కల్వకుంట్ల కవిత రక్తదానం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆమె బ్లడ్ డొనేట్ చేశారు.

Samayam Telugu 1 May 2020, 3:03 pm
నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రక్తదానం చేశారు. తన అన్న కేటీఆర్ పిలుపు మేరకు ఆమె ఈ మంచి పని చేశారు. లాక్‌డౌన్ కారణంగా చాలా వరకు బ్లాడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో తలసేమియాతో బాధపడుతున్న వారికి ఎక్కించడానికి రక్తం కొరత తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
Samayam Telugu కవిత రక్తదానం


అన్నయ్య పిలుపునకు స్పందించిన కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వల్ల తలసేమియా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని.. ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం ఉపయోగపడుతుందని తెలిపారు. రక్తదానం చేసే సమయంలో మాస్క్‌లు ధరించిన తగిన జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.