యాప్నగరం

పీఎస్‌లో ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకొని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

పోలీస్ స్టేషన్లో ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకొని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం నిజామాబాద్‌లో కలకలం రేపింది. ఎస్సైతో వివాదమే ఈ ఘటనకు కారణమని చెబుతున్నారు. కాగా పోలీసులు మాత్రం అనారోగ్యమే కారణమంటున్నారు.

Samayam Telugu 18 Sep 2019, 4:19 pm
పోలీస్ స్టేషన్లో ఎస్సై రివాల్వర్‌‌తో కాల్చుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో.. హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ రెడ్డి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Samayam Telugu constable-1


ఓ కేసు విషయంలో.. ఎస్సై రాజశేఖర రెడ్డితో విభేదాలు తలెత్తడమే ప్రకాశ్‌ రెడ్డి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఎస్సై, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. మరో మూడు నెలల్లో ప్రకాశ్ రెడ్డి రిటైర్ కావాల్సి ఉంది.

కాగా పోలీసులు మాత్రం ఆరోగ్య సమస్యలతోనే ప్రకాశ్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. ప్రకాశ్ రెడ్డికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటున్నారు.

Read Also: కాంగ్రెస్ సాధు జంతువు, బీజేపీ పులి.. కేసీఆర్ ఇలా: రాజగోపాల్

ఘటన సమాచారం అందుకున్న వెంటనే.. పోలీస్ కమిషనర్ కార్తికేయ ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్సై తన రివాల్వర్‌ను స్టేషన్‌లోనే ఉంచి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.