యాప్నగరం

Nizamabad Bypoll 2020: నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం.. రెండు గంటల్లోనే ఫలితం

మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కిస్తారు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 821. దీంతో మొదటి రౌండ్లోనే విజయం ఎవరిదో తేలిపోనుంది. మరోవైపు టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు.

Samayam Telugu 12 Oct 2020, 8:35 am
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభంమైంది. మరో రెండు గంటల్లోనే ఎన్నికల ఫలితం రానుంది. 99.64 పోలింగ్ నమోదు అయ్యింది. రెండు రౌండ్లలోనే ఫలితం రానుంది. మొదటి రౌండ్లో 600 ఓట్లను లెక్కిస్తారు. రెండో రౌండ్లో మిగిలిన 221 ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం ఆరు టేబుళ్లను ఏర్పాటు చేశారు. 9 గంటలకే మొదటి రౌండ్ ఫలితం రానుంది. మొదటి రౌండ్‌లోనే విజయం ఎవరిదో తేలిపోనుంది.
Samayam Telugu నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్
nizamabad mlc by elections


ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 821 మంది ఓటు వేశారు. రాజంపేట, గాంధారి మండలాలకు చెందిన ఇద్దరు కరోనా కారణంగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించారు. మరో ఓటరు గత నెలలో చనిపోయాడు. ఇక పోలైన ఓట్లలో ఆరోవంతు వస్తేనే అభ్యర్ధికి డిపాజిట్ వస్తుంది. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రెండు రౌండ్లలో కౌంటింగ్ పక్రియ పూర్తి చేయనున్నారు. ఈ ఎన్నికల్లో TRS తరపున మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్‌ తరపున సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీపడ్డారు.

Read More: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వారికి నో ఛాన్స్... కేసీఆర్ నిరాకరణ

మరోవైపు ఓట్ల లెక్కింపు సందర్భంగా పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లెక్కింపు కేంద్రానికి ఒక్కో పార్టీ నుంచి ఎనిమిది మందిని అనుమతించారు. ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న పోలింగ్ జరిగింది. ఇటు అభ్యర్ధుల విషయానికి వస్తే టీఆరెస్‌ గెలుపు ఖాయమన్న దీమాతో ఉంది. సంబరాలకు కూడా టీఆర్ఎస్ క్యాడర్‌ సిద్ధమవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.