యాప్నగరం

కేసీఆర్ చెప్పింది నిజమైతే ఉరేసుకుంటా.. లేదంటే నువ్వు వేసుకుంటావా: ఎంపీ సంచలన వ్యాఖ్యలు

New Delhi: ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తీసుకురానున్న కొత్త విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్ చెప్పినదంతా అబద్ధమని కొట్టిపారేశారు.

Samayam Telugu 17 Sep 2020, 6:42 pm
కేంద్రం తేనున్న కొత్త విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యుత్ బిల్లులోని వివరాలు సంపూర్ణంగా చదివి మాట్లాడాలని సీఎం కేసీఆర్‌కు ఆయన హితవు పలికారు. విద్యుత్ చట్టంతో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వలేమనేది అబద్ధమని అన్నారు. విద్యుత్ బిల్లులో ఉన్న అంశాలన్నింటినీ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అబద్ధాలుగా చెప్పారని విమర్శించారు. ఆయన అబద్ధాలు చెప్తుంటే ఎమ్మెల్యేలంతా చప్పట్లు కొడుతున్నారని అన్నారు. బిల్లులోని అంశాలు చదివితే అన్ని నిజాలు తెలుస్తాయని, చదవకుండా తప్పుడు మాటలు మాట్లాడవద్దని అన్నారు. ఢిల్లీలో ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
Samayam Telugu ధర్మపురి అర్వింద్, కేసీఆర్ (ఫైల్ ఫోటోలు)
Dharmapuri Arvind KCR


కొత్త విద్యుత్ బిల్లు గురించి కేసీఆర్ చెప్పిన మాటలు నిజమైతే తాను ఉరేసుకుంటానని, లేదంటే నువ్వు ఉరేసుకుంటావా అని సీఎంకు అర్వింద్ సవాలు విసిరారు. విద్యుత్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం బిల్లు ఉద్దేశమని, డిస్కంలు నిర్వీర్యం అవుతాయని కేసీఆర్ అనడాన్ని అర్వింద్ కొట్టిపారేశారు. కొత్త చట్టం వల్ల డిస్కంలు బలపడతాయని వివరించారు. తెలంగాణలో విద్యుత్ వ్యవస్థ రూ.30 వేల కోట్లు నష్టాల్లో ఉందని, గత ఆరున్నరేళ్లలో ఒక్క మెగా వాట్ విద్యుత్ కూడా పెంచలేదని వ్యాఖ్యానించారు. ఈ లెక్కన కేసీఆర్ విద్యుత్ రంగాన్ని ఏం మెరుగుపరుస్తున్నట్లో చెప్పాలని ప్రశ్నించారు.

Must Read: హైదరాబాదీలకు జీహెచ్ఎంసీ అలర్ట్! ఇళ్ల నుంచి బయటికి రావొద్దు: కమిషనర్Must Watch: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.