యాప్నగరం

'బండి సంజయ్‌ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు.. ఉపసంహరించుకుంటే మంచిది'

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని తెలిపారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని.. అవి ఆయన వ్యక్తిగత వాఖ్యలన్నారు. తన వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకుంటే మంచిదంటూ హితవు కూడా పలికారు. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఈడీ విచారణపై కూడా తనదైన శైలిలో స్పందించారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 12 Mar 2023, 10:41 pm

ప్రధానాంశాలు:

  • కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన అర్వింద్
  • బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించనని తేల్చేసిన అర్వింద్
  • ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదంటూ హితవు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu arvind darmapuri
అర్వింద్ ధర్మపురి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఎప్పుడూ విమర్శలు గుప్పించే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖండించారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించనని అర్వింద్ స్పష్టం చేశారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి సంబంధిచినవి కావని.. కేవలం ఆయన వ్యక్తిగతమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలకు ఆయనే సమాధానం చెప్పాలని తెలిపారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటే మంచిదంటూ బండి సంజయ్‌కు అర్వింద్ హితవు పలికారు. బండి సంజయ్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధంగా మారాయని తెలిపారు. తెలంగాణ సామెతలు చాలా ఉంటాయని.. కానీ వాటిని జాగ్రత్తగా వినియోగించాలన్నారు.
ఇదిలా ఉంటే.. కవిత ఈడీ దర్యాప్తుపై మాత్రం మళ్లీ తనదైన శైలిలోనే సెటైర్లు వేశారు. కీలకమైన విచారణ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఆందోళనలు చేయడమేంటని ప్రశ్నించారు. కవిత ఈడీ ఆఫీసులో ఉంటే మంత్రులంతా దిల్లీలో మకాం వేశారన్నారు. ఇదే చిత్తశుద్ది రాష్ట్ర అభివృద్ధిపై ఉంటే.. ఇప్పటటికే తెలంగాణ ఎంతో బాగుపడేదంటూ చురకలంటించారు. దర్యాప్తునకు కవిత ఏమాత్రం సహకరించలేదని తెలిసిందన్నారు అర్వింద్. అధికారులు.. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడిగుతుంటే... తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ విచిత్రమైన సమాధానాలు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం అందినట్టు తెలిపారు.

కవిత చేతికి 20 లక్షల రూపాయల గడియారం, కోట్ల విలువ చేసే నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలందరికీ తెలుసని అర్వింద్ తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం వల్లే మాగుంట ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడిందన్నారు. పెద్ద సంస్థ అయిన అరబిందో కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటోందంటూ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

'ప్రేమ గుడ్డిదని తెలుసు కానీ మరీ ఇంతా..' నవీన్ హత్య కేసుపై ఆర్జీవీ వెటకారం
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.