యాప్నగరం

ధర్మపురి అర్వింద్ గుండు రహస్యం ఇదే.. బయటపెట్టిన ఎంపీ, ఫక్కున నవ్వులు

Nizamabad MP: ఇంతకుముందు తిరుపతికి వెళ్లిన భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి, రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడేవారని అర్వింద్ గుర్తు చేశారు. సుదర్శన టోకెన్లు వచ్చాక గంట సేపట్లో శ్రీవారి దర్శనం అయిపోతుందని తెలిపారు.

Samayam Telugu 20 Dec 2020, 7:20 pm
తెలంగాణ బీజేపీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరే వేరు. అధికార పార్టీ నాయకుల్ని తిట్టాలన్నా.. ఏదైనా అంశం గురించి వివరించాలన్నా ఆయనది ఓ ప్రత్యేక శైలి. ఆహార్యంతోపాటు, భాష కూడా వినూత్నంగా ఉంటుంది. ప్రతి అంశాన్ని ఉదాహరణలతో వివరిస్తుంటారు. తాజాగా ఆయన వరంగల్ రూరల్ జిల్లాలో ఆదివారం ఓ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త వ్యవసాయ చట్టాల ఉపయోగాలను వివరించారు. ఈ క్రమంలోనే తన గుండు రహస్యం గురించి కూడా చమత్కరించారు. ఆయన ఎప్పుడూ నున్నటి గుండుతో కనిపించే సంగతి తెలిసిందే.
Samayam Telugu ధర్మపురి అర్వింద్ (ఫైల్ ఫోటో)
Dharmapuri Arvind


తన గుండు గురించి మాట్లాడుతూ అర్వింద్ తనపై తానే ఫన్నీ కామెంట్ చేసుకున్నారు. తాను ఎక్కువగా గుండుతో కనిపించడానికి కారణం తిరుపతి అంటూ నవ్వులు పూయించారు. తిరుపతికి తరచూ వెళ్లి వెళ్లి.. గుండు చేయించుకొనేవాడినని.. ఇలా చేయడం వల్ల పర్మినెంట్‌గా గుండు అయిపోయిందని వివరించారు. గుండు వ్యవసాయ చట్టాల వల్ల కలిగే మేలు గురించి ఆయన వివరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంతకుముందు తిరుపతికి వెళ్లిన భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి, రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడేవారని అర్వింద్ గుర్తు చేశారు. సుదర్శన టోకెన్లు వచ్చాక గంట సేపట్లో శ్రీవారి దర్శనం అయిపోతుందని తెలిపారు. అలాగే కొత్త చట్టాలు అమల్లోకి వస్తే రైతులకు మార్కెట్ యార్డులలో వేచి ఉండే అవసరమే లేదని అన్నారు. త్వరగా అమ్మకాలు జరుపుకుని మార్కెట్ నుంచి బయటకు రావొచ్చని అన్నారు. రైతులకు వ్యవసాయ చట్టాలు సుదర్శన టోకెన్ల లాంటివని అర్వింద్ పోల్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.