యాప్నగరం

Ghmc Polling: ఓటర్లు లేక పోలింగ్‌ బూతుల్లో పడుకున్న సిబ్బంది

పలుచోట్ల పోలింగ్ శాతం భారీగా తగ్గింది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ భారీగా తగ్గిందని అధికారులు, రాజకీయ నేతలు సైతం చర్చించుకుంటున్నారు.

Samayam Telugu 1 Dec 2020, 4:50 pm
ఎన్నికల షెడ్యూల్ నుంచి మొదలైన హడావుడి. నామినేషన్ల దాఖలు, నామినేషన్ల ఉపసంహరణ, నామినేషన్ల పరిశీలన. ఆ తర్వాత పార్టీల జోర్ దార్ ప్రచారాలు. రాత్రనక, పగలనక పర్యటనలు... సభలు సమావేశాలు. మేనిఫెస్టోలు.. ప్రజలకు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కో రకమైన వరాలు. మేం వస్తే అలా చేస్తే.. ఇది ఇస్తాం.. ఎన్నో వాగ్దానాలు. హామీలు. అన్ని అయ్యాయి. రావాల్సిన సమయం వచ్చింది. కానీ.. అందుకు రావాల్సిన వాళ్లు మాత్రం కదిలి రాలేదు. తమ భవిష్యత్తును బలంగా తీర్చిదిద్దే ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎవరొస్తే మనకేంటిలే.. ఏ పార్టీ గెలిస్తే మనకేం వస్తాదిలే అన్న చందాగా గ్రేటర్ ప్రజలు వ్యవహరించారు. ఫలితంగా పలు పోలింగ్ భారీగా తగ్గిపోయింది. పలు పోలింగ్ కేంద్రాల్లో అయితే ఓటర్లు రాక అక్కడ పనిచేసే సిబ్బంది టేబుళ్లపై ప్రశాంతంగా పడుకోవడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.
Samayam Telugu పడుకున్న ఎన్నికల సిబ్బంది


హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురా తలాబ్ చంచలంలో పరిస్థితి మరి దారుణంగా మారింది. ఇక్కడ 44వేల 969మంద ఓటర్లు ఉన్నారు. కానీ మధ్యాహ్నం దాటినా ఓటు వేసేందుకు మాత్రం కేవలం 332మంది మాత్రమే వచ్చారు. అంటే అక్కడున్న ఓటర్లలో ఒక్క శాతం మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఓటర్లు లేక పనిలేక.. ప్రశాంతంగా తామ పనిచేయాల్సిన బల్లలపైనే పడుకున్నారు. ప్రజలు ఓటు వేసేందుకు ఎంత ఇంట్రస్ట్ చూపిస్తున్నారో దీని బట్టి తెలుస్తోంది. దీంతో పలువురు భాగ్యనగర ప్రజల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.