యాప్నగరం

నోముల నర్సింహయ్య చివరి మాటలు.. ఆడియో వైరల్

ఆడియో క్లిప్పింగ్స్ అటు టీఆర్ఎస్ పార్టీ, కుటుంబ సభ్యులు స్పందించారు. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసినవే అని ఆరోపించారు.

Samayam Telugu 2 Dec 2020, 2:30 pm
మంగళవారం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణించారు. నోముల ఆకస్మిక మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో నిండిపోయింది. అయితే ఆయన చివరి మాటలతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ ఆడియో క్లిప్పింగ్స్‌పై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. అవన్నీ ఫేక్ అని పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొంతమంది రాజకీయ ప్రత్యర్ధులు దురుద్దేశంతో ఇలాంటి ఫేక్ ఆడియాలు సృష్టించారంటున్నారు. ఈమేరకు ఎమ్మెల్యే నర్సింహయ్య బావమరిది సాదం సంపత్ కుమార్ ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu నోముల నర్సింహయ్య మృతి
nomula narsimhaiah death


నోముల పేరుతో వైరల్ అవుతున్న ఆడియోలో ‘ నన్ను ఎర్రజెండ బిడ్డగానే సాగనంపండి.......!, నోముల నర్సింహయ్య మరణ వాగ్మూలం ! వ్యక్తుల మీద కోపంతోనో, ఆర్దిక ఇబ్బందుల ఒత్తిడితోనో పార్టీ నిర్మాణపు వొడుదొడుకుల సమస్యలతోనో........అమ్మ లాంటి అరుణ పతాకాన్ని వీడి సాధించేదేమీ లేదు. వ్యక్తిత్వాలను చంపుకొని ఆత్మ గౌరవాన్ని వదులుకొని, పవిత్ర విప్లవ కర్తవ్యానికి దూరం కాకండి. బూర్జువా పార్టీలను వీడి ఎర్రజెండాలతో కొనసాగండి’ అనే వ్యాఖ్యలు ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది.

Read More: టీఆర్ఎస్‌లో మరో విషాదం.. పార్టీ నేత ఆకస్మిక మృతి

మరోవైపు నోముల నర్సింహయ్యవిగా చెబుతున్న ఫోన్ రికార్డులు ఫేక్ అని తెలంగాణ రాష్ట్ర సమితి ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారని పేర్కొంది. అవి నిజమైనవి కావని తమ ప్రకటనలో పేర్కొంది. అసాంఘీక శక్తుల చర్యల్లో ఇది భాగమని టీఆర్ఎస్ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.