యాప్నగరం

MIM Case: దిగ్విజయ్‌ సింగ్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ

Telangana Congress: ఎంఐఎం నేత దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు చుక్కెదురైంది. ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారంటె జారీ చేసింది.

Samayam Telugu 22 Feb 2021, 6:53 pm
కాంగ్రెస్ సీనియర్‌ నేత, ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మాజీ అధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్‌ అన్వర్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం (ఫిబ్రవరి 22) వారంట్‌ ఇచ్చింది. మజ్లిస్ పార్టీపై 2016లో దిగ్విజయ్‌ సింగ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆ పార్టీ నాయకుడు హుస్సేన్ అన్వర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
Samayam Telugu దిగ్విజయ్ సింగ్
Digvijay Singh


అనారోగ్యం కారణంగా విచారణకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా దిగ్విజయ్‌ సింగ్ కోరారు. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. అనంతరం నాన్-బెయిలబుల్ వారంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.

మరోవైపు.. 2005 నాటి నిరసన కార్యక్రమం కేసులో నాటి టీడీపీ నేతలకు కోర్టు సమన్లు జారీ చేసింది. వీరిలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సహా పలువురు కీలక నేతలు ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.