యాప్నగరం

సిరిసిల్ల టూర్‌లో జలుబు, తుమ్ములతో ఇబ్బంది పడ్డ కేటీఆర్.. కారణం ఇదే

మంత్రి కేటీఆర్ తన ఆరోగ్యం గురించి వివరణ ఇచ్చారు. గత కొన్నేళ్లుగా తాను జలుబుకు సంబంధించిన అలెర్జీతో బాధపడుతున్నానని తెలిపారు.

Samayam Telugu 12 May 2020, 2:51 pm
తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం తన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్‌లో రూ.11.76 కోట్లతో నూతనంగా నిర్మించిన పరిపాలనా భవనం, భోజనశాల, నాలుగు వరుసల రోడ్డు మరియు ఇతర సౌకర్యాలను ప్రారంభించారు. కాగా సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ అనారోగ్యంతో కనిపించారు. పదే పదే టవల్ అడ్డుపెట్టుకొని తుమ్ముతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. కేటీఆర్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమైంది.
Samayam Telugu కేటీఆర్


మంత్రి ఫ్లూతో బాధపడుతున్నారా లేదా మరేదైనా సమస్యతో బాధపడుతున్నారా అని తెలియలేదు. దీంతో ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఇదే విషయాన్ని కేటీఆర్ వద్ద ప్రస్తావించగా.. తాను చాలా ఏళ్లుగా అలర్జీతో బాధపడుతున్నానని చెప్పారు. అందుకే జలుబు, తుమ్ములు వచ్చాయన్నారు.

ముందుగానే సిరిసిల్లలో పర్యటించాలని అనుకోవడంతో.. చివరి నిమిషంలో తన పర్యటనను వాయిదా వేసుకుంటే ప్రజలు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో సిరిసిల్ల వెళ్లానని చెప్పారు. తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని ఆయన కోరారు. ఈ ట్వీట్ చూసిన ఆయన అభిమానులు.. అన్నా ఆరోగ్యం జాగ్రత్త అని సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.