యాప్నగరం

నుమాయిష్ ఎగ్జిబిషన్ ఆరంభం.. ఈసారి ప్రత్యేకతలివే..

Nampalli: బుధవారం సాయంత్రం మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌, ఈటల రాజేందర్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఏటా 46 రోజుల పాటు నుమాయిష్‌ ప్రదర్శన జరుగుతున్న విషయం తెలిసిందే.

Samayam Telugu 1 Jan 2020, 7:11 pm
హైదరాబాద్‌లో ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ (అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన) ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌, ఈటల రాజేందర్‌ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఏటా 46 రోజుల పాటు (జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు)నుమాయిష్‌ ప్రదర్శన జరుగుతున్న విషయం తెలిసిందే. ఎగ్జిబిషన్ సందర్భంగా సందర్శకుల సౌకర్యార్థం మెట్రో రైలు సర్వీసులు రాత్రి 11 గంటల వరకు నడవనున్నాయి. గతంలో ఎగ్జిబిషన్‌లో దాదాపు 2,500 వరకూ స్టాళ్లను ఏర్పాటు చేసే వారు కాగా.. ఈ సంవత్సరం కొన్ని కారణాల వల్ల వాటిని కుదించి 1,500 నుంచి 2 వేల మధ్య మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Samayam Telugu Numaish


Also Read: నా చిన్నప్పుడు ఆ పార్టీ ఎలా ఉందో ఇప్పుడూ అంతే ఉంది: కేటీఆర్

ప్రత్యేకతలివీ..
ఏటా ఎగ్జిబిషన్‌ లోనికి ప్రవేశించే మార్గాలకు అదనంగా ఈసారి మరో ఆరింటిని ఏర్పాటు చేశారు. భద్రతపరమైన నిఘా కోసం నిరంతరం అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తున్నారు. సెక్యూరిటీ తనిఖీలతోపాటు ప్రత్యేకమైన సిబ్బందితో స్టాళ్లలో సిలిండర్లను ఏర్పాటు చేయకుండా నిరంతరం సోదాలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.

Also Read: వైరల్ వీడియో: యువకులను బూటు కాలుతో తన్ని.. పోలీసుల భీభత్సం!

స్టాళ్లకు ఇన్సూరెన్స్‌లు
గతేడు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈసారి అన్ని స్టాళ్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ ఈసారి పబ్లిక్‌ లియబిలిటీ కింద రూ.5 కోట్ల వరకు బీమా సౌకర్యాన్ని కల్పించింది. స్టాల్‌ యజమానులు తక్కువ ప్రీమియంతో ఇన్సూరెన్స్‌ తప్పనిసరిగా తీసుకోవాలని సొసైటీ సూచించింది. అగ్ని మాపక నిబంధనలు పాటించని స్టాల్ యజమానులకు విద్యుత్‌ సరఫరా నిలిపి వేస్తామని సొసైటీ హెచ్చరించింది.

Also Read: New Year 2020: ఒక్కరోజులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలిస్తే షాక్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.