యాప్నగరం

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్టులు.. ఆ 22 మంది ఎవరు?

Drugs in Hyderabad: సప్లయర్ అయిన ఓ నైజీరియన్ నుంచి 70 గ్రాముల కొకైన్‌ను గ్రాము రూ.7 వేల చొప్పున కొనుగోలు చేశారు. వ్యాపారం పేరుతో లాక్ డౌన్ పాస్ తీసుకుని తరుణ్ జ్యోత్ సింగ్, అమిత్ కుమార్ బెంగళూరుకు వెళ్లారు.

Samayam Telugu 5 Jun 2020, 2:28 pm
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్న ఎక్సైజ్ అధికారులు కీలకాంశాలను గుర్తించారు. విచారణలో భాగంగా ఈ దందాకు సంబంధించి కొత్త లింకులు బయటపడ్డాయి. డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ పట్టుబడ్డ తరుణ్ జ్యోత్ సింగ్, అమిత్ కుమార్‌ అనే వ్యక్తులు కొద్ది రోజుల క్రితం పట్టుబడ్డ సంగతి తెలిసిందే. వీరిని అరెస్టు చేసి విచారణ జరపగా ఈ డ్రగ్స్ భూతంతో ఇప్పటిదాకా 22 మందికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ 22 మంది పేర్లను చార్జిషీట్‌లో చేర్చారు. అయితే, వీరి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
drugs rocket hyderabad


ఆ నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను సిద్ధం చేశారు. హైదరాబాద్‌లో పాత కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు, సరఫరా దారులుగా కొత్తవారిని ఎంపిక చేసుకున్నట్లుగా విచారణలో గుర్తించారు. 2017 జూన్‌లో హైదరాబాద్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ నేపథ్యంలో వారిపై నిఘా ఉంచడంతో సరఫరాదారులను కొత్తగా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా కేసులో నిందితులు అమిత్ కుమార్, తరుణ్ జ్యోత్ సింగ్ అరెస్టుతో ప్రముఖుల చిట్టా బయటపడినట్లు అధికారులు చెప్పారు. ఈ డ్రగ్స్ దందాలో వినియోగదారులుగా సినీ ప్రముఖులతోపాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Must Read: undefined

సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన తరుణ్ జ్యోత్ సింగ్, అమిత్ కుమార్ వ్యాపారం పేరుతో లాక్ డౌన్ పాస్ తీసుకుని బెంగళూరుకు కారులో వెళ్లారు. అక్కడే సప్లయర్ అయిన ఓ నైజీరియన్ నుంచి 70 గ్రాముల కొకైన్‌ను గ్రాము రూ.7 వేల చొప్పున కొనుగోలు చేశారు. గత నెల 30న పట్టుకున్నారు. 54 గ్రాముల కొకైన్‌తోపాటు రెండు కార్లు, మూడు సెల్ పోన్లు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.