యాప్నగరం

జీహెచ్ఎంసీ ఎన్నికలు: రేపే ఓట్ల లెక్కింపు.. అన్ని ఏర్పాట్లు పూర్తి

GHMC Elections: శాంతిభద్రతల ఏర్పాటులో భాగంగా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Samayam Telugu 3 Dec 2020, 5:27 pm
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి రేపు ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే శుక్రవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ ఆంజనీ కుమార్ వెల్లడించారు. శుక్రవారం జరగబోయే జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రేటర్లో శాంతిభద్రతల ఏర్పాటులో భాగంగా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేదాజ్ఞలు విధిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu అంజనీ కుమార్
anjani kumar


అందులో భాగంగానే రోడ్లపై ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులను చేయడం నిషేధించారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరూ ఆయుధాలను చేతిలో కర్రలు, లాఠీలు, పేలుడు పదార్ధాలు, ఇతర ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు.

అలాగే ఊరేగింపులు, గుంపులు గుంపులుగా పోగవడం, సమావేశాలు నిర్వహించడం వంటివి కూడా నిషేధించారు. తాత్కాలికంగా ఎక్కడా టెండ్లు వేయడం, స్టేజీలను ఏర్పాటు చేయడం.. మైకులు ఏర్పాటుచేయడం, పబ్లిక్‌ లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించరాదు. రాళ్లను కలిగి ఉండడం, తరలించం కూడా చేయరాదు. రోడ్లపైనా, కూడళ్లలో ప్రసంగాలు ఇవ్వడం, ప్రదర్శనలు నిర్వహించడం, ప్లకార్డుల ప్రదర్శనలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం వంటివి కూడా చేయరాదని పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.