తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి ఇటీవలే ఇద్దరు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో షాద్నగర్ మండలంలోని చేగూరుకు చెందిన భారతమ్మ అనే మహిళ కూడా ఉంది. ఆమె చనిపోయిన తర్వాత శాంపిళ్లు సేకరించి ల్యాబ్కు పంపగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆమె అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్థులు, ఆమె బంధువులు భయాందోళనకు గురయ్యారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన 22 మందిని గుర్తించిన అధికారులు.. వారిని రాజేంద్ర నగర్లోని క్వారంటైన్ సెంటర్కు తరలించారు. మృతురాలి భర్తను కోరంటి ఆసుపత్రికి తరలించారు.
భారతమ్మ మరణంతో వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖ అధికారుల బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మొత్తం షాద్నగర్ తరలి వెళ్లింది. కరోనా బారిన పడిన విషయం తెలియక.. భారతమ్మ మొదట ఓ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుంది. కానీ తగ్గకపోవడంతో.. హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రభుత్వ హాస్పిటళ్లకు నేరుగా వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కనబెట్టి భారతమ్మకు చికిత్స చేసినందుగానూ ఆర్ఎంపీ డాక్టర్కు చెందిన క్లినిక్ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. భారతమ్మకు చికిత్స చేసిన ఆర్ఎంపీ డాక్టర్ను కూడా అధికారులు కరోనా పరీక్షలకు పంపారు. ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం క్లినిక్ను సీజ్ చేసిన అధికారులు... ఆర్ఎంపీలు ఎవరైనా క్లినిక్లు తెరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భారతమ్మ మరణంతో వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖ అధికారుల బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మొత్తం షాద్నగర్ తరలి వెళ్లింది. కరోనా బారిన పడిన విషయం తెలియక.. భారతమ్మ మొదట ఓ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుంది. కానీ తగ్గకపోవడంతో.. హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది.
దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా ప్రభుత్వ హాస్పిటళ్లకు నేరుగా వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కనబెట్టి భారతమ్మకు చికిత్స చేసినందుగానూ ఆర్ఎంపీ డాక్టర్కు చెందిన క్లినిక్ను సీజ్ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. భారతమ్మకు చికిత్స చేసిన ఆర్ఎంపీ డాక్టర్ను కూడా అధికారులు కరోనా పరీక్షలకు పంపారు. ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం క్లినిక్ను సీజ్ చేసిన అధికారులు... ఆర్ఎంపీలు ఎవరైనా క్లినిక్లు తెరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.