యాప్నగరం

Omicron BA.4: హైదరాబాద్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. దేశంలో ఇదే తొలిసారి

Omicron BA.4 variant | దేశంలో తొలిసారి హైదరాబాద్‌లో ఒమిక్రాన్ BA.4 వేరియంట్‌ కేసును గుర్తించారని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ సబ్‌వేరియంట్‌ను గుర్తించారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 20 May 2022, 6:44 pm

ప్రధానాంశాలు:

  • దేశంలో కరోనా కొత్త వేరియంట్
  • హైదరాబాద్‌లో బీఏ.4 వేరియంట్ గుర్తింపు
  • దక్షిణాఫ్రికా నుంచి వ్యక్తిలో వైరస్
  • తిరిగి తన దేశానికి వెళ్లిపోయిన వ్యక్తి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Omicron BA.4 Variant | Representative Image
Omicron BA.4 Variant first case in Hyderabad: Reports
దేశంలో తొలిసారి హైదరాబాద్‌లో ఒమిక్రాన్ బీఏ.4 వేరియంట్‌ కేసు నమోదైంది. ఈ విషయాన్ని INSACOG (సైంటిస్ట్స్ అసోసియేటెడ్ విత్ ఇండియన్ సార్స్ కోవ్ 2 కన్సార్టియం ఆయన జీనోమ్స్) వెల్లడించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తిలో ఈ సబ్ వేరియంట్‌ను గుర్తించారు.
ఈ నెల తొలి వారంలో దక్షిణాఫ్రికా నుంచి సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యింది. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో ఆ సమావేశంలో పాల్గొన్న 24 మందికీ టెస్టులు చేశారు. వారికి నెగెటివ్ వచ్చినప్పటికీ వారందర్నీ డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉంచారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి మే 16 తిరిగి వెళ్లిపోయారు. ఆయనలోనూ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.

దీంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. కాగా బీఏ.4 వేరియంట్ కేసులు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో.. డబ్ల్యూహెచ్‌వో వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా గుర్తించింది. దేశంలో తొలి బీఏ.4 వేరియంట్ కేసును గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

మన దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల విషయానికి వస్తే... ముందు రోజుతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 2,259 కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 2,614 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది. డైలీ పాజిటివీటి రేటు 0.50 శాతంగా నమోదైంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.