యాప్నగరం

గాలివాన బీభత్సం.. ఎగిరిపడ్డ కోహెడ పండ్ల మార్కెట్ షెడ్, రైతులకు గాయాలు

Hyderabad: కోహెడలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ షెడ్ గాలివాన బీభత్సానికి కుప్పకూలింది. రైతులు, పలువురు హమాలీలు గాయపడ్డారు. అంబులెన్స్‌లు రావడానికి ఆలస్యం కావడంతో గాయాలతో విలవిల్లాడారు.

Samayam Telugu 5 May 2020, 9:40 am
గాలివాన బీభత్సానికి కోహెడ పండ్ల మార్కెట్ కుప్పకూలింది. సోమవారం (మే 4) సాయంత్రం గాలివాన బీభత్సం చేసింది. పండ్ల మార్కెట్ షెడ్ మొత్తం కూలిపోయి, రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో పలువురు హమాలీలతో పాటు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే.. అక్కడ అంబులెన్స్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించడానికి ఆలస్యమైంది.
Samayam Telugu కోహెడ మార్కెట్
Koheda


మార్కెట్లో సరైన వసతులు లేకపోయినప్పటికీ తరలించడం పట్ల రైతులతో పాటు హమాలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో హైదరాబాదులోని కొత్తపేటలో ఉండే ఫ్రూట్ మార్కెట్‌ను కోహెడకు తరలించిన సంగతి తెల్సిందే. తాత్కాలికంగా షెడ్లను నిర్మించి కోహెడ ప్రాంతంలో పండ్ల మార్కెట్ ను ఏర్పాటు చేశారు.

Also Read: కార్మికుల తరలింపునకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. 40 ప్రత్యేక రైళ్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.