పాత ఇనుప సామాన్లు దుకాణంలో పేలుడు సంభవించి ఒకరు మృతిచెందిన ఘటన సూర్యాపేటలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరొకరి తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్పస్వామి ఆలయం సమీపంలోని ఇనుప సామాన్ల షాపులో ఈ ఘటన సంభవించింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వైద్యం కోసం హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. షాపులో పనిచేస్తున్న సాహు అనేక కార్మికుడు మృతిచెందగా, మరో కార్మికుడు సల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడికి కన్నుకు తీవ్రగాయమైనట్టు వైద్యులు తెలిపారు. వీరిద్దరినీ మధ్యప్రదేశ్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఉపాధి కోసం అక్కడ నుంచి వచ్చిన యువకులు, ఇనుప సామాన్ల షాపులో పనిచేస్తున్నారు.
గతవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లోనూ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్వే 279 పిల్లర్ వద్ద జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఫుట్పాత్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న కవర్ను తెరుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆ వ్యక్తి చేతులు ఛిద్రమయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడి ప్రాణాలు కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
గతవారం హైదరాబాద్లోని రాజేంద్రనగర్లోనూ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్వే 279 పిల్లర్ వద్ద జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఫుట్పాత్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న కవర్ను తెరుస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి ఆ వ్యక్తి చేతులు ఛిద్రమయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడి ప్రాణాలు కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.