యాప్నగరం

జూబ్లీహిల్స్‌లో ప్రమాదం: కుక్కును ఢీకొట్టి బైక్.. యువకుడు మృతి

హైదరాబాద్ నగరంలో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకోవడం వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. హెల్మెట్ ధరించాలని, వేగం తగ్గించుకోవాలని పోలీసులు చెబుతున్న మాటలను తలకెక్కించుకోవడం లేదు.

Samayam Telugu 24 Feb 2020, 8:09 am
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేటీఎం బైక్‌పై ఓ యువకుడు వెళ్తుండగా కుక్కు అడ్డుగా వచ్చింది. దీంతో కుక్కను ఢీకొట్టిన బైక్ అనంతరం డివైడర్‌ను ఢీకొట్టింది. వాహనంపై యువకుడు డివైడర్‌పై పడిపోవడంతో అతడి తలకు తీవ్రగాయమైంది. యువకుడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో కుక్కు కూడా మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu jubileeaccident


మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతివేగమే ప్రమాదానికి కారణమని అంటున్నారు. యువకుడు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బయటపడేవాడు. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి వేగంగా వెళ్తూ కుక్కను ఢీకొట్టడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆ వెనుకే వస్తున్న మరో వ్యక్తి అతడి వాహనాన్ని ఢీకొట్టి కిందపడిపోయాడు. దీంతో అతడికి గాయాలయ్యాయి.

మరోవైపు, నగరంలో తరుచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకటి మరచిపోక ముందే మరొకటి చోటుచేసుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డెక్కాల్సి వస్తోంది. ఆదివారం నాడు నగరంలో జరిగిన ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు. హయత్‌నగర్ వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. భారీగా జరిమానాలు విధిస్తున్నా, కేసులు పెడుతున్నా ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.