యాప్నగరం

చెవిలో హెడ్ ఫోన్స్ .. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కడియాల కుంట తండా రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. రాంసింగ్ చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండటంతో ట్రైన్ వస్తున్న శబ్ధం వినిపించలేదు.

Samayam Telugu 28 Sep 2020, 12:17 pm
చెవిలో హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ.. రైలును ఢీకొన్న దుర్టటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈఘటనలో ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి దుర్మరణం పాలైయ్యాడు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండా సమీపంలో రైల్వే ట్రాక్ పై ఈ సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రాయికల్ బురుజు గడ్డ తండాకు చెందిన మూడవత్ రాంసింగ్ డబల్ లైన్ రైల్వే ట్రాక్ పై ఫోన్ మాట్లాడుతూ నిలుచున్నాడు.
Samayam Telugu one man death in train accident at ranga reddy district
చెవిలో హెడ్ ఫోన్స్ .. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం


Read More: హేమంత్, అవంతి తల్లులు బెస్ట్ ఫ్రెండ్స్.. విచారణలో షాకింగ్ నిజాలు

పాత రైల్వే ట్రాక్ పై రైలు వస్తుందనే భావనతో కొత్త రైల్వే ట్రాక్ పై నిలుచుని ఫోన్ మాట్లాడుతున్నాడు. చెవిలో హెడ్ ఫోన్స్ ఉండడంతో రైలు వచ్చే శబ్దం వినిపించలేదు. దీంతో రైలు దగ్గరకు వచ్చినా కూడా రాంసింగ్‌ చెవిలో ఇయర్ ఫోన్స్ ఉండటంతో రైలు వస్తున్న శబ్ధం వినిపించలేదు. దీంతో రైలు సమీపించి రాంసింగ్ ను ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే రాంసింగ్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.