యాప్నగరం

సింగరేణి గనిలో డంపర్ వాహనం బీభత్సం.. ఒకరు మృతి

లింగయ్య మృతితో మండి పడ్డా స్థానికులు గనిలో ఆందోళనకు దిగారు. ఆఫీసులో ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Samayam Telugu 15 Dec 2020, 11:06 am
సింగరేణి డంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఓ వ్యక్తిపైకి డంపర్ దూసుకెళ్లింది. ఈ ఘటన జయశంకర భూపాలపల్లి జిల్లాలోని గడ్డిగానిపల్లిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జడల లింగయ్య మృతి చెందాడు. సింగరేణి కాకతీయ ఉపరితల గని సెక్టార్ వన్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై గ్రామస్తుల ఆందోళనకు దిగారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్‌లోకి గ్రామస్తులు చోరబడి పలు వాహనాలను ధ్వంసం చేశారు.
Samayam Telugu సింగరేణిలో ప్రమాదం


Read More: మంత్రి పువ్వాడ అజయ్‌కు కరోనా పాజిటివ్

సింగరేణి ఓసి సేఫ్టీ ఆఫీస్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో ఓపెన్ కాస్ట్ గని పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులు మృతికి కారకులైన వారిని గుర్తించాలని వెంటనే ఓపెన్ కాస్ట్ గని ని మూసివేయాలని లేనిపక్షంలో ఇలాగే ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.