యాప్నగరం

Hyderabad: అర్ధరాత్రి 20 కిలోల ఉల్లి దొంగతనం.. సీసీటీవీ వీడియో

ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతుండడం గమనించిన ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. అది కూడా 20 కిలోల సంచిని. అర్ధరాత్రి నిర్మానుష్యంగా సమయంలో బజారు పక్కన ఉన్న తోపుడు బండిపై ఉల్లి సంచులను బైక్‌పై ఎత్తుకెళ్లిపోయాడు.

Samayam Telugu 14 Dec 2019, 3:21 pm
ప్రస్తుతం ఉల్లికి ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఉల్లిపై తెగ జోకులు షికారు చేస్తుండడమే కాకుండా.. పెళ్లిళ్లకు ఈ అత్యంత నిత్యావసర సరకును బహుమతిగా అందించిన ఘటనలు అనేకం ఇటీవల జరిగాయి. చివరికి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన భార్యకు ఉల్లిపాయతో తయారు చేసిన ఇయర్ రింగ్స్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. అయితే, కొద్ది నెలలుగా ఉల్లి ధరలు విపరీతంగా పెగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం.
Samayam Telugu Onion robbery



Must Read: ‘సమత’ కుటుంబంలో మరో విషాదం

ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతుండడం గమనించిన ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. అది కూడా 20 కిలోల సంచిని. అర్ధరాత్రి నిర్మానుష్యంగా సమయంలో బజారు పక్కన ఉన్న తోపుడు బండిపై ఉల్లి సంచులను బైక్‌పై ఎత్తుకెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన చిత్రాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో చోటుచేసుకుంది.

Must Read: ‘ఈనాడు’ నుంచి తప్పుకున్న రామోజీరావు

చిక్కడపల్లి దోమలగూడలో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారి బండి నుంచి 20 కిలోల ఉల్లిగడ్డలు చోరీ చేశాడు. దీనిని గుర్తించిన వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగను సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియోలో గుర్తించినట్లు తెలిపారు.

Also Read: Disha Case: ఫోరెన్సిక్ నివేదికలో మరో సంచలన విషయం గుర్తింపు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.