యాప్నగరం

YS Jagan నిర్ణయంతో కేసీఆర్‌పై ఒత్తిడి..! కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేలేరా?

కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రభావంతో తెలంగాణ సీఎంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Samayam Telugu 10 Jul 2020, 1:42 pm
కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చుతూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా కరోనా బారిన పడే పేదలు ఉచితంగా వైద్య సేవలు పొందే వీలుంది. ప్రయివేట్ హాస్పిటళ్లలో చికిత్సకు డబ్బులు లేని పేదలకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం. కాగా.. ఏపీ ప్రభుత్వంలాగే తెలంగాణ సర్కారు కూడా కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.
Samayam Telugu జగన్ కేసీఆర్
ys jagan mohan reddy and kcr


కరోనా చికిత్సను జగన్ ఆరోగ్య శ్రీలో చేర్చినట్లుగానే.. కేసీఆర్ సర్కారు కూడా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకడుగు ముందుకేసి... టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విపత్తు వేళ జగన్ ఆరోగ్య శ్రీ జాబితాలో కరోనా చికిత్సను చేరిస్తే.. కేసీఆర్ సెక్రటేరియట్‌ను కూలుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరి ప్రాధాన్యం ఏంటో తెలుస్తోందంటూ చురకలు అంటించారు.

తెలంగాణలో అత్యవసరంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘‘ఈ రోజు టీఆర్ఎస్ కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఉండి ఉంటే తెలంగాణ ప్రజలకు ఈ కష్టకాలంలో ఇటువంటి దారుణ పరిస్థితులు వచ్చి ఉండేవి కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుంది, ఎన్నో ప్రాణాలు కూడా కాపాడిఉండేది. కరోనా చికిత్స కూడా ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ క్రింద ఉండేది’’ అని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనా చికిత్సను చేర్చాలని కోరుతూ బీసీ సంఘాల నేతలు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇదే డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
Read Also: నిజామాబాద్‌ హాస్పిటల్‌లో దారుణం.. ఆక్సిజన్ అందక నలుగురు మృతి

ఇప్పటికే కేంద్రం కరోనా చికిత్సను ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. కానీ ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీనే మెరుగైన పథకం అని చెప్పిన కేసీఆర్.. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయడం లేదు. కానీ ఇప్పుడు కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేకపోవడంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: కరోనా పాజిటివ్ రేటులో దేశంలో తెలంగాణ టాప్.. ఏపీ కంటే 8 రెట్లు ఎక్కువ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.