యాప్నగరం

ప్రైవేటు బస్సు దగ్ధం.. లోపల 26 మంది ప్రయాణికులు

Sangareddy: బస్సు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సమీపంలోకి రాగానే బస్సు ముందు భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను కిందకు దింపేశాడు.

Samayam Telugu 13 Mar 2020, 1:05 pm
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో శుక్రవారం ఉదయం ఆరెంజ్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సు అగ్ని కీలల్లో చిక్కుకుంది. కానీ త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండడం గమనార్హం. నడిరోడ్డుపై ఒక్కసారిగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముంబయి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఆరెంజ్‌ ట్రావెల్స్‌‌కు ఈ ప్రమాదం జరిగింది.
Samayam Telugu WhatsApp Image 2020-03-13 at 8.25.18 AM.


బస్సు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సమీపంలోకి రాగానే బస్సు ముందు భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రయాణికులను కిందకు దింపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు దిగిన వెంటనే క్షణాల్లో బస్సు కాలి బూడిదైంది.

Also Read: విమానం నడిపిన మంత్రి కేటీఆర్..! వీడియో

బస్సులో ఉన్న ప్రయాణికుల లగేజీ మొత్తం అగ్ని కీలలకు కాలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. తొలుత బస్సు ఇంజిన్‌లోంచి మంటలు వ్యాపించినట్లుగా గమనించిన ప్రయాణికులు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


Also Read: లేగ దూడపై అత్యాచార యత్నం.. హైదరాబాద్‌లో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.