యాప్నగరం

అచ్చంపేటలో దారుణం.. మహిళ శవాన్ని పీక్కుతిన్న పందులు!

Achampet: ప్రస్తుతం చలికాలం కావడం.. ఆమె అప్పటికే అనారోగ్యం పాలవడంతో మహిళ నిద్రలోనే చనిపోయి ఉంటుందని స్థానికులు వెల్లడించారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పందులు పీక్కుతిన్నట్లు పోలీసులు తెలిపారు.

Samayam Telugu 13 Dec 2020, 12:59 pm
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆవరణలో అర్ధరాత్రి పందులు అనాథ మహిళా శవాన్ని పీక్కుతిన్నాయి. దిక్కూమొక్కూలేని ఓ అభాగ్యురాలి విషయంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన మహిళ కొన్నాళ్లుగా పట్టణంలో బిక్షాటన చేసుకొనేదని స్థానికులు వెల్లడించారు. పగలంతా బిచ్చమెత్తుకొని రాత్రి పూట బస్టాండ్ ఆవరణలో తలదాచుకునేదని చెప్పారు. ఏ దిక్కూ లేని ఆ అభాగ్యురాలు చాలా కాలంగా బస్టాండు దగ్గరే కాలం వెళ్లదీస్తున్నట్లు చెప్పారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Death Picture


అయితే, ప్రస్తుతం చలికాలం కావడం.. ఆమె అప్పటికే అనారోగ్యం పాలవడంతో మహిళ నిద్రలోనే చనిపోయి ఉంటుందని స్థానికులు వెల్లడించారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో పందులు పీక్కుతిన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం చేసేందుకు శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టణాల్లో పందులను పెంచవద్దన్న నిబంధన ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలేదని పట్టణ వాసులు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.