యాప్నగరం

ఉస్మానియా సిబ్బంది ఆందోళన.. జీతాలు ఇవ్వట్లేదని నిరసన

Osmania Hospital: పని ఒత్తిడి ఉన్నా తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నామని, ఎక్కువ పని గంటలు కూడా పని చేస్తున్నామని సిబ్బంది వెల్లడించారు. అయినా, ప్రభుత్వం తమ బతుకులతో ఆడుకుంటోందని వాపోయారు.

Samayam Telugu 12 Aug 2020, 3:00 pm
ఉస్మానియా ఆస్పత్రి ఎదుట వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ ఉస్మానియా ఆసుపత్రి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు జీతాలు పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయినా, అధికారులు తమకు జీతాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu ఉస్మానియా ఆస్పత్రి (ఫైల్ ఫోటో)
Osmania hospital new


పని ఒత్తిడి ఉన్నా తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నామని, ఎక్కువ పని గంటలు కూడా పని చేస్తున్నామని వెల్లడించారు. అయినా, ప్రభుత్వం తమ బతుకులతో ఆడుకుంటోందని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, గాంధీ ఆసుపత్రిలో ఒప్పంద కార్మికులు, సిబ్బందికి జీతాలు పెంచినట్లే తమకు కూడా పెంచాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.