యాప్నగరం

వారిలో ముస్లింలెంతమంది? పోలీసులకు, ఆధార్‌కు ఒవైసీ సూటి ప్రశ్న

Aadhaar: 127 మంది వ్యక్తులు తప్పుడు సమాచారంతో ఆధార్ కార్డు పొందారనే ఆరోపణలపై వీరికి యూఐడీఏఐ నోటీసులు జారీ చేసింది. వీరంతా ఒకరి తర్వాత మరొకరు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

Samayam Telugu 19 Feb 2020, 12:57 pm
హైదరాబాద్‌లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులివ్వడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ 127 మంది జాబితాలో ముస్లింలు, దళితులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నిస్తూ తెలంగాణ పోలీస్, ఆధార్ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం ఆధార్ సంస్థకు లేదని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించే సమయంలో ఆధార్ అడగడం మానేయాలని సూచించారు.
Samayam Telugu Owaisi


Also Read: బారాత్‌లో డాన్స్ చేస్తూ ఇంటర్ విద్యార్థి మృతి, గుండెపోటుగా అనుమానం

127 మంది వ్యక్తులు తప్పుడు సమాచారంతో ఆధార్ కార్డు పొందారనే ఆరోపణలపై వీరికి యూఐడీఏఐ నోటీసులు జారీ చేసింది. వీరంతా ఒకరి తర్వాత మరొకరు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పటికే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీపై ముస్లింలు దేశ వ్యాప్త పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 127 మందికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: జనరల్ వార్డులో స్వైన్ ఫ్లూ రోగి.. గాంధీ సిబ్బంది నిర్వాకం!

మైనారిటీలు, దళితులు లక్ష్యంగానే ఈ వేధింపులు చేస్తున్నారని అసదుద్దీన్ ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే వారికి నోటీసులు జారీ చేసి అన్ని గుర్తింపు పత్రాలను మళ్లీ పరిశీలిస్తామంటున్నారని వివరించారు.

Also Read: అలా అయితే మేం జాతీయ పార్టీ పెడతాం.. కేటీఆర్, పీయుశ్ గోయల్ మధ్య సరదా చర్చ

Must Read: రతన్ టాటా ట్వీట్‌కు కేటీఆర్ స్పందన.. కంటతడి పెట్టిస్తున్న వీడియో


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.