యాప్నగరం

నిజామాబాద్: బాలుడిపై బాబాయ్ దాష్టీకం.. కాళ్లతో తన్నుతూ, తాడుతో లాక్కెళ్తూ..

Nizamabad: బాలుడిని యజమాని చిత్ర హింసలకు గురిచేస్తున్నా జనమంతా చోద్యం చూశారు కానీ ఏ ఒక్కరూ ఆపకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Samayam Telugu 12 Aug 2020, 6:52 pm
నిజామాబాద్ జిల్లాలో బాలుడిపై ఓ పెద్ద మనిషి అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. 12 ఏళ్ల బాలుడిని పశువులు కట్టేసే చోట కట్టేసి చితకబాదాడు. తనను కొట్టవద్దని ఆ బాలుడు అతణ్ని ఎంతగా వేడుకున్నా ఆ ఇనుప హృదయం ద్రవించలేదు. అంతటితో ఆగకుండా కాళ్లను తాడుతో కట్టేసి బాలుడిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ అమానవీయ ఘటన నిజామాబాద్‌ జిల్లాలోని మల్కాపూర్‌ (ఎ) గ్రామంలో జరిగింది. అయితే, ఈ వీడియో బుధవారమే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందనే అంశంపై స్పష్టత లేదు.
Samayam Telugu బాలుడిపై వ్యక్తి దాష్టీకం
owner beats a 12 year old boy for not coming to his work in Nizamabad


బాలుడిని యజమాని చిత్ర హింసలకు గురిచేస్తున్నా జనమంతా చోద్యం చూశారు కానీ ఏ ఒక్కరూ ఆపకపోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: undefined

అయితే, సోషల్ మీడియాలో ఈ వీడియోలు, ఫోటోలపై రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. 12 ఏళ్ల బాలుడ్ని ఆ వ్యక్తి పనిలో పెట్టుకున్నాడని, ఆ రోజు పనిలోకి రాకపోయేసరికి యజమాని ఆగ్రహించి ఇలా కొడుతున్నాడని అంటున్నారు. మరోవైపు, బాలుడ్ని కొట్టే వ్యక్తి స్వయంగా అతని బాబాయ్ అని, ఇంట్లో నుంచి డబ్బు దొంగతనం చేసి పారిపోవడంతో అతని బాబాయ్ ఇలా దండిస్తున్నాడని పోస్ట్ చేశారు. ఏది ఏమైనా 12 ఏళ్ల బాలుడ్ని అందరి ముందు తాళ్లతో కట్టేసి, కాళ్లతో తన్నుతూ, రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి పశువులు కట్టేసే చోట తాడుతో కట్టేయడం వివాదాస్పదంగా మారింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.