యాప్నగరం

ఆర్టీసీ బస్సుకు రూ.1000 ఫైన్

Hyderabad నగరంలో ఓ ఆర్టీసీ బస్సు అతివేగంగా దూసుకెళ్లింది. ఆ బస్సును ఆపి డ్రైవర్‌కు రూ.1000 జరిమానా విధించారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 7 Feb 2020, 6:28 pm
నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సుపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. బస్సును వేగంగా నడిపిన డ్రైవర్‌కు 1000 రూపాయల జరిమానా విధించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం (ఫిబ్రవరి 7) మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఏపీ 28 జెడ్ 1220 నంబర్ గల ఆర్టీసీ బస్సును ఆపిన పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.
Samayam Telugu fine


డ్రైవర్ సురేందర్ రెడ్డి అతివేగంగా బస్సును నడుపుతూ నియమ నిబంధనలను ఉల్లంఘించాడని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వేగంగా బస్సు నడిపిన ఘటనల్లో ట్రాఫిక్ పోలీసులు గతంలోనూ పలువురు డ్రైవర్లకు జరిమానా విధించారు.

Also Read: కంపెనీ సీఈవోపై కన్నేశాడు.. ఆమెను ఎలాగైనా పొందాలనుకొని, చివరికి ట్విస్టు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.