యాప్నగరం

సీఎం కేసీఆర్, మంత్రులకు అనుమానాస్పద పార్సిళ్లు.. ఆ బాటిళ్లలో ఏముంది?

CM KCR తెలంగాణ మంత్రులు, ఐఏఎస్ అధికారులకు అనుమానాస్పద పార్సిళ్లు వచ్చాయి. ఆ పార్సిళ్లలో బాటిళ్లను గుర్తించిన అధికారులు అందులో ఏముందో కనిపెట్టే పనిలో ఉన్నారు.

Samayam Telugu 20 Aug 2019, 10:11 pm
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేరుతో పోస్టులో వచ్చిన బాటిళ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్‌ పోస్టల్‌ కార్యాలయానికి సీఎం, మంత్రుల పేరుతో మంగళవారం (ఆగస్టు 20) అనుమానాస్పద పార్సిళ్లు వచ్చాయి. ప్రముఖుల పేరుతో వచ్చిన పార్సిళ్లను గుర్తించిన పోస్టల్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పార్సిళ్లలో వచ్చిన ఆ బాటిళ్లలో ఏముందో కనిపెట్టే పనిలో పడ్డారు. బాటిళ్లలో ఉన్న శాంపిల్స్‌ను తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.
Samayam Telugu parcel
Representational Image


పార్సిల్ ద్వారా వచ్చిన సదరు బాటిళ్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఏవైనా ఉన్నాయోమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు పార్సిళ్లన్నీ ఓయూ అడ్రస్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని గోప్యంగా ఉంచి విచారిస్తున్నారు.

Must Read: శ్రీశైలం వివాదానికి తెర పడినట్లేనా?

ఈ పార్సిళ్ల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఐఏఎస్ అధికారులకు వీటిని ఏ ఉద్దేశంతో పంపించారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆకతాయిల చర్యా? లేకపోతే.. ఏదైనా సమస్యను హైలెట్ చేయడానికి ఈ దారి ఎన్నుకున్నారా? అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.