యాప్నగరం

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం?

Telangana Eamcet: పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించినట్లు చూపిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించారని అంటున్నారు.

Samayam Telugu 7 Oct 2020, 9:47 pm
ఇటీవల విడుదలైన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొంది. విద్యార్థులకు ఎంసెట్‌ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులకు ఎంసెట్‌లో కటాఫ్‌ మార్కులు వచ్చినా ఇంటర్‌లో అన్ని సబ్జెక్టుల్లో పాసైనా కూడా ఫలితాల్లో మాత్రం అనుత్తీర్ణులైనట్లు ఫలితం చూపిస్తోందని విద్యార్థులు అంటున్నారు. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించినట్లు చూపిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించారని అంటున్నారు. ఎంసెట్‌ ఫలితాలను చూసి కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంగుతింటున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
exams


తెలంగాణ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ ఫలితాలను మంగళవారం కేపీహెచ్‌బీలోని జేఎన్‌టీయూలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. సెప్టెంబరు నెలలో నిర్వహించిన ఎంసెట్‌ రాసేందుకు 1,43,326 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 1,19,183 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 75.2 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.