కారు ప్రమాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు.. హైదరాబాద్ తరలింపు
రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఆయణ్ని హైదరాబాద్ తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు చేవెళ్ల వద్ద ప్రమాదానికి గురైంది.
Samayam Telugu 20 Sep 2019, 11:03 pm
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శుక్రవారం (సెప్టెంబర్ 20) రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ ఎమ్మెల్యేను స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహేశ్వర్ రెడ్డి 2018 ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Also Read: హరీశ్ రావుతో ఘర్షణ ఉండదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుంచి పరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహేశ్వర్ రెడ్డి 2018 ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Also Read: హరీశ్ రావుతో ఘర్షణ ఉండదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు