యాప్నగరం

రెండ్రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన

Telangana Congress: తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు కనబడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలుకుతోందని విమర్శించారు.

Samayam Telugu 1 Oct 2020, 5:04 pm
సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లుపై దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం అవుతోందని గుర్తు చేశారు. గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని.. మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక బిల్లులపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త నిరసనలు జరుగుతాయని తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
Samayam Telugu జగ్గారెడ్డి
jaggareddy


మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లు కనబడుతోందని ఆరోపించారు. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలుకుతోందని విమర్శించారు. రెండు రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారని, తప్పక కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

భారీ సంఖ్యలో తరలిరావాలి..
ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ శుక్రవారం సంగారెడ్డి గంజి మైదానంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బైక్‌ ర్యాలీ, సంతకాల సేకరణ ఉంటుందని తెలిపారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.