యాప్నగరం

బ్రేకింగ్: బావిలో పడ్డ జీపు.. లోపల 16 మంది ప్రయాణికులు

Warangal Rural: జేసీపీ సాయంతో జీపును బయటకు తీసే చర్యలు చేపట్టారు. బావి మొత్తం నీటితో నిండి ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Samayam Telugu 27 Oct 2020, 7:54 pm
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామ శివారులో మంగళవారం ఓ జీపు అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఆ సమయంలో జీపులో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. వరంగల్ నుంచి నెక్కొండ వైపు ప్రయాణికులను తీసుకొని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. జీపు డ్రైవర్‌కు ఫిట్స్ రావడం వల్ల అదుపు తప్పి వాహనం బావిలో పడ్డట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు జీపులోని పన్నెండు మంది ప్రయాణికులను క్షేమంగా బయటికి తీసినట్లు సమాచారం. మరో నలుగురు ప్రయాణికులు నీటిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు
warangal accident


స్థానికుల ద్వారా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక కార్యక్రమాలను చేపట్టారు. జేసీపీ సాయంతో జీపును బయటకు తీసే చర్యలు చేపట్టారు. బావి మొత్తం నీటితో నిండి ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే 12 మంది ప్రయాణికులను రక్షించగా.. బయటకు వచ్చిన వారు బావిలోనే చిక్కుకుపోయిన తమ వారికోసం రోదిస్తున్నారు.

చీకటి పడడంతో పాటు బావి లోతుగా ఉండడంతో జేసిబీకి జీప్ చిక్కడం లేదు. అందుకే పోలీసులు వెంటనే ఫైర్ ఇంజిన్ తెప్పించి బావిలో నుండి నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. జీపు బావి లోతులోకి వెళ్ళి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ముందు సీట్లో ఉన్నవాళ్లు బయటకు రాలేకపోయారు. జీప్ లోనే చిక్కుకున్నారు. వారి కోసమని పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.


Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.