గణేష్ శోభాయాత్ర అంటే హైదరాబాద్లో హడావుడి అంతా ఇంతా కాదు. శోభాయాత్ర ఒక ఎత్తయితే.. మీడియా చేసే హంగామా మరో ఎత్తు. లైవ్ కవరేజీ, వైవిధ్య ప్రసారాల పేరుతో టీవీ వాళ్లు జనం మధ్య దిగిపోతారు. టీవీల్లో కనిపించాలనే జనం కోరికను వీళ్లు బాగా క్యాష్ చేసుకుంటారు. మామూలు రిపోర్టర్లు, యాంకర్లు అయితే పెద్దగా సమస్యేమీ ఉండదు. బిత్తిరి సత్తి లాంటి పాపులర్ యాంకర్.. మైక్ పట్టుకొని జనం మధ్య దిగిపోతే.. పోలీసులకు అది కొత్త రకం తలనొప్పిని తెచ్చిపెడుతుంది. గురువారం (సెప్టెంబర్ 12) హుస్సేన్ సాగర్ వద్ద గణేష్ నిమజ్జనోత్సవాల్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
గురువారం ఉదయం ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఎప్పటిలాగే నెక్లెస్ రోడ్డు వద్దకు తీసుకొచ్చారు. పోలీసుల భారీ భద్రత మధ్య ఆరో నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఆ ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి భక్తులు అప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొంత మంది మీడియా ప్రతినిధులు రిపోర్టింగ్ కోసం అక్కడికి చేరుకున్నారు.
Also Read: బడా గణేష్ పూర్తిగా మునిగేలా ఈసారి ఏం చేశారంటే..
‘ఇస్మార్ట్’ రిపోర్టింగ్ కోసం యాంకర్ బిత్తిరి సత్తి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆయణ్ని చూడగానే జనం చుట్టూ మూగారు. షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బిత్తిరి సత్తిని అక్కడ నుంచి తరలించారు.
భద్రతాపరంగా ఇది సరైన పని కాదని బిత్తిరి సత్తికి ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి సూచించారు. ‘మీరు ఇక్కడుంటే జనాన్ని కంట్రోల్ చెయ్యడం ఇబ్బంది అవుతుంది. ఇలా పక్కకు రండి’ అని తీసుకెళ్లారు. అక్కడే ఉన్న మరో యాంకర్ దేవి.. ఐదు నిమిషాల్లో వస్తారా అని ప్రశ్న వేయగా.. బిత్తిరి సత్తి తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు.
‘ఐదు నిమిషాల్లో నేను తిరిగిరాలేను. ఫోలీసోళ్లు నన్ను ఎక్కడికో ఫార్సిలింగ్ చేస్తున్నారు. రక్షణ చర్యల కోసం ఇలా చేస్తున్నారు’ అని బిత్తిరి సత్తి అన్నాడు. తీర్మాన్ న్యూస్ ద్వారా గుర్తింపు పొందిన బిత్తిరి సత్తి ఇటీవలే టీవీ9లో చేరి ‘ఇస్మార్ట్ వార్తలు’ పేరుతో జనం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇదేలా పేలుతుందో.. వేచి చూడాల్సిందే!
గురువారం ఉదయం ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఎప్పటిలాగే నెక్లెస్ రోడ్డు వద్దకు తీసుకొచ్చారు. పోలీసుల భారీ భద్రత మధ్య ఆరో నంబర్ క్రేన్ వద్ద నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఆ ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి భక్తులు అప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కొంత మంది మీడియా ప్రతినిధులు రిపోర్టింగ్ కోసం అక్కడికి చేరుకున్నారు.
Also Read: బడా గణేష్ పూర్తిగా మునిగేలా ఈసారి ఏం చేశారంటే..
‘ఇస్మార్ట్’ రిపోర్టింగ్ కోసం యాంకర్ బిత్తిరి సత్తి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆయణ్ని చూడగానే జనం చుట్టూ మూగారు. షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బిత్తిరి సత్తిని అక్కడ నుంచి తరలించారు.
భద్రతాపరంగా ఇది సరైన పని కాదని బిత్తిరి సత్తికి ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి సూచించారు. ‘మీరు ఇక్కడుంటే జనాన్ని కంట్రోల్ చెయ్యడం ఇబ్బంది అవుతుంది. ఇలా పక్కకు రండి’ అని తీసుకెళ్లారు. అక్కడే ఉన్న మరో యాంకర్ దేవి.. ఐదు నిమిషాల్లో వస్తారా అని ప్రశ్న వేయగా.. బిత్తిరి సత్తి తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు.
‘ఐదు నిమిషాల్లో నేను తిరిగిరాలేను. ఫోలీసోళ్లు నన్ను ఎక్కడికో ఫార్సిలింగ్ చేస్తున్నారు. రక్షణ చర్యల కోసం ఇలా చేస్తున్నారు’ అని బిత్తిరి సత్తి అన్నాడు. తీర్మాన్ న్యూస్ ద్వారా గుర్తింపు పొందిన బిత్తిరి సత్తి ఇటీవలే టీవీ9లో చేరి ‘ఇస్మార్ట్ వార్తలు’ పేరుతో జనం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇదేలా పేలుతుందో.. వేచి చూడాల్సిందే!