యాప్నగరం

కరోనా భయం.. నడిరోడ్డుపై వ్యక్తి మృతి, అంతా దూరం జరిగిపోయి దారుణం

Karimnagar Coronavirus: కరీంనగర్ నగరంలోని కశ్మీర్ గడ్డ రైతు బజారు వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కూరగాయల కోసం వచ్చిన ఓ వ్యక్తి అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోయాడు.

Samayam Telugu 25 Mar 2020, 11:55 am
కరోనా వైరస్ భయం జనాల్లో ఏ స్థాయిలో ఉందో తెలిపే దారుణ ఘటన ఇది. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. నిత్యావసరాల కోసం మార్కెట్‌కు వచ్చిన ఓ వ్యక్తికి గుండెపోటుతో కుప్పకూలి మరణించడంతో, స్థానికులు కనీసం అతని దగ్గరికి కూడా రాలేదు. రోడ్డుపై ఉన్న అతి కొద్ది మంది కూడా చాలా సేపటివరకూ అతడికి దూరంగా వెళ్లిపోయారు.
Samayam Telugu krmr


కరీంనగర్ నగరంలోని కశ్మీర్ గడ్డ రైతు బజారు వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కూరగాయల కోసం వచ్చిన ఓ వ్యక్తి అక్కడికక్కడే గుండెపోటుతో చనిపోయాడు. కరోనా భయంతో స్థానికులు మృతదేహం వద్దకు రావడానికి కూడా జంకారు. స్థానికులు 100 కి ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Also Read: లాక్‌డౌన్‌లోనూ ఆన్‌లైన్ ఆర్డర్లు.. హోం డెలివరీ! ఎలాగంటే.. కేటీఆర్ ట్వీట్

కరీంనగర్‌కు ఇటీవల ఇండోనేసియా నుంచి వచ్చిన 10 మంది వ్యక్తులకు కరోనా సోకడంతో నగరంలో తీవ్రమైన కర్ఫ్యూ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ ఇండోనేసియన్ల నుంచి ఓ స్థానికుడికి కూడా కరోనా సోకడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇండోనేసియాకు చెందిన వారు సంచరించిన చోట మొత్తం రెడ్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. ప్రజల్లో నెలకొన్న ఈ భయంతోనే ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించినా కనీసం దగ్గరకు వెళ్లి ఉండరని అధికారులు చెబుతున్నారు.

Must Read: ధరలు పెంచితే జైలుకే, 6 దాటితే అంతే.. పీడీయాక్ట్, ఏడ్చినా వదలం: కేసీఆర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.