యాప్నగరం

పక్కింటి కుక్కను కాల్చి చంపిన వ్యక్తి.. యజమాని ఫిర్యాదుతో అరెస్టు

Hyderabad: అరుస్తోందనే కోపంతో ఓ వ్యక్తి పెంపుడు కుక్కను కాల్చి చంపేశాడు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. యజమాని ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేశారు.

Samayam Telugu 23 Dec 2019, 8:40 pm
క్కింటికి చెందిన ఓ పెంపుడు కుక్క తరచూ తమ ఇంట్లోకి వస్తోందని, అస్తమానం అరుస్తోందని విసుగు చెందిన ఓ వ్యక్తి ఏకంగా దాన్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బాపూనగర్ కాలనీలో ఆదివారం (డిసెంబర్ 22) మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీరా శునకాన్ని చంపేశాడని తెలుసుకొని షాక్ తిన్నారు. నిందితుడిని అవినాశ్‌ కరణ్‌ (38)గా గుర్తించారు. అతడు బేగంపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Samayam Telugu Representative Image


మృతి చెందిన శునకాన్ని సరూర్‌నగర్‌కు చెందిన దేవేందర్ యాదవ్‌కు చెందినదిగా గుర్తించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు అవినాశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిందితుడు తన ఎయిర్‌గన్‌తో శునకాన్ని కాల్చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ప్రాణి అక్కడికక్కడే మృతి చెందింది.

Don't Miss: సులభ్ కాంప్లెక్స్‌తో తుపాకుల కలకలం.. హత్యకు ప్లాన్ చేశారా?

కుక్క తరచూ తమ ఇంట్లోకి వస్తుందనే కోపంతో నిందితుడు కాల్చినట్లు పోలీసులు తెలిపారు. అవినాశ్ ఉపయోగించిన ఎయిర్‌గన్‌ను గత సంవత్సరం బషీర్‌బాగ్‌లో రూ.18 వేలకు కొనుగోలు చేసినట్లు అతడు పోలీసులతో చెప్పాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: చాగంటి ప్రవచనాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.