యాప్నగరం

kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్

తెలంగాణ ఇంజినీర్ ఫోరమ్ కన్వీనర్ పిల్ దాఖలు చేశారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. పాత పద్ధతి ద్వారానే మూడు టీఎంసీల నీటిని తరలించే ప్రక్రియ చేపట్టాలన్నారు.

Samayam Telugu 12 Nov 2020, 12:57 pm
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై హై కోర్టులో పిల్ ధాఖలు అయ్యింది. మూడు TMC నీటిని పంప్ లైన్ సిస్టం ద్వారా తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు అయ్యింది. తెలంగాణ ఇంజినీర్ ఫోరమ్ కన్వీనర్ దొంతుల లక్ష్మీ నారాయణ పీల్ దాఖలు చేశారు.హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మూడు టీఎంసీల పద్దతి ద్వారా నీటి తరలింపు చేస్తే 8 వేల కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని పిటిషనర్ తెలిపారు. ఇప్పటి వరకు రెండు టీఎంసీల నీటి తరలింపు ప్రక్రియ ను కెనాల్ గ్రావిటేషనల్ టన్నల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారా తరలించారని పిటీషనర్ కోర్టుకు తెలిపారు.
Samayam Telugu కాళేశ్వరం ప్రాజెక్టు
kaleshwaram project


ప్రతి ఏటా వేయి కోట్ల రూపాయల మేంటనెన్స్ ఖర్చు అవుతుందన్నారు మూడు టీఎంసీల పైప్ లైన్ పద్ధతి ద్వారా తరలిస్తే భూ సేకరణ సమస్య తో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయని పిటిషనర్ పేర్కొన్నారు. మూడో టీఎంసీ నీటి తరలింపు పాత పద్ధతి ద్వారానే పనులు చేపట్టాలని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మిచొద్దన్ని ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇప్పటి వరకు రెండు టీఎంసీల నీటిని కెనాల్ గ్రావిటేషనల్ టన్నల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారానే నీటిని తరలించారన్నారు.

Read More: కరోనా వ్యాక్సిన్‌పై మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు

మెడి గడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలువల ద్వారానే పనులు జరిగాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం ఐదుగురు ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
Ts ప్రభుత్వం, కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇర్రిగేషన్. మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్.మినిస్టర్ ఇన్విరారమెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.నాలుగు వారాల్లో దీని పై పూర్తి ని వేదిక సమర్పించాలని ప్రతివాదులకు హైకోర్ట్ ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.