యాప్నగరం

చైతన్యపురిలో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

Yadadri Bhongir జిల్లా యాదగిరిగుట్టకు చెందిన ఓ విద్యార్థిని చైతన్యపురిలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఫార్మసీ చదువుతూ నగరంలో నివాసం ఉంటోంది.

Samayam Telugu 29 Feb 2020, 7:53 pm
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అలకాపురి కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం (ఫిబ్రవరి 29) మధ్యాహ్నం హాస్టల్ భవనంలోని తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలిని యాదగిరిగుట్టకు చెందిన తేజస్వినిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu suicide


తేజస్విని శనివారం మధ్యాహ్నం నుంచి గది తలుపులు తీయకపోవడంతో హాస్టల్‌ సిబ్బంది అనుమానంతో కిటికీ నుంచి చూడగా.. ఫ్యానుకు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. హాస్టల్‌ నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: పోలీసుల మందు పార్టీ, నాగినీ డ్యాన్స్.. వీడియో వైరల్, సీపీ సజ్జనార్ ఫైర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.