యాప్నగరం

నాయిని అంత్యక్రియల్లో రెచ్చిపోయిన దొంగ.. పలువురి జేబులు ఖాళీ.. వీడియో

Maha Prasthanam: జేబు దొంగ ఓ పార్టీ నేత జేబులో నుంచి పర్సును కొట్టేస్తుండగా దొరికిపోయాడు. వెంటనే సదరు పార్టీ నాయకుడు దొంగను పట్టుకున్నారు. అందరూ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Samayam Telugu 22 Oct 2020, 8:24 pm
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా జేబు దొంగలు రెచ్చిపోయారు. తమ అభిమాన నేత లేరని అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు బాధపడుతుంటే, ఇంతటి దు:ఖం సమయంలోనూ జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. పలువురు టీఆర్‌ఎస్ నేతల జేబుల్లో ఉన్న నగదు కొట్టేసి తమ జేబుల్లోకి సర్దుకున్నారు. ఈ క్రమంలో జేబు దొంగ ఓ పార్టీ నేత జేబులో నుంచి పర్సును కొట్టేస్తుండగా దొరికిపోయాడు. వెంటనే సదరు పార్టీ నాయకుడు దొంగను పట్టుకున్నారు. అందరూ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతడి నుంచి మూడువేలకు పైగా సొమ్మును రికవరీ చేశారు. ఈ ముఠాలోని ఇతరుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.
Samayam Telugu డబ్బు కొట్టేస్తూ పట్టుబడ్డ వ్యక్తి
nayini funeral ceremony


మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణంతో టీఆర్‌ఎస్ పార్టీ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. తమ ప్రియతమ నేతను కొల్పోయినందుకు కార్యకర్తలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. నాయినికి కడసారి వీడ్కోలు పలికేందుకు వందలాది టీఆర్‌ఎస్ నేతలు వచ్చారు. నగరంలోని మహా ప్రస్థానం స్మశానవాటికలో ముగిశాయి. అయితే నరసింహారెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నేతలు భావోద్వేగానికి గురయ్యాయి.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.