యాప్నగరం

క్రిమినల్ కేసులో జైలు శిక్ష.. చిక్కుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే, హైకోర్టులో పిల్

TRS ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. క్రిమినల్ కేసులో న్యాయస్థానం జైలు శిక్ష విధించిన కారణంగా ఆయన ఎన్నికల చెల్లదని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది.

Samayam Telugu 29 Sep 2019, 12:29 pm
హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నిక చెల్లదని ప్రకటించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. హరీశ్ యాదవ్ అనే వ్యక్తి ఈ పిల్ దాఖలు చేశారు. 2015లో ఓ క్రిమినల్ కేసులో కింది కోర్టు మహిపాల్ రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించిందని పిటీషనర్ పేర్కొన్నారు. తీర్పు అమలు కాకుండా మహిపాల్ రెడ్డి స్టే తెచ్చుకున్నారని.. క్రిమినల్ కేసులో రెండున్నరేళ్లకుపైగా జైలు శిక్ష పడిన వ్యక్తులకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదని హరీశ్ యాదవ్ పిటీషన్లో పేర్కొన్నారు.
Samayam Telugu mahipal reddy


ఈ విషయాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకుండా మహిపాల్ రెడ్డి వాస్తవాలను దాచిపెట్టారని.. అప్పీల్ ద్వారా ఆయన స్టే పొందారు కానీ శిక్ష రద్దు కాలేదని పిటీషనర్ న్యాయస్థానానికి తెలిపారు.

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అప్పీలు కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువు ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పొడిగించకపోతే.. వాటంతట అవే రద్దు అవుతాయని పిటీషినర్ తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయడం కోసం నామినేషన్‌ వేసిన 2018, సెప్టెంబరు 29 నాటికే మహిపాల్ రెడ్డికి అర్హత లేదని పేర్కొన్నారు. పిటీషర్ వాదనతో న్యాయస్థానం ఏకీభవిస్తే.. మహిపాల్ రెడ్డికి చిక్కులు తప్పవేమో.

Read Also: హుజూర్‌నగర్ హీట్.. మరో నిజామాబాద్ అవుతుందా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.