యాప్నగరం

అనుభవంలేని డ్రైవర్లతో ప్రమాదం.. ఆర్టీసీపై హైకోర్టులో మరో పిటిషన్

Telangana High Court: ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అర్హత, అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నారని.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Samayam Telugu 25 Nov 2019, 1:39 pm
ర్టీసీ వ్యవహారంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అర్హత, అనుభవం లేని డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారంటూ లాయర్ గోపాలకృష్ణ ఉన్నత న్యాయస్థానంలో పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో సోమవారం (నవంబర్ 25) విచారణ జరిగింది. తాత్కాలిక డ్రైవర్లకు కనీసం 80 రోజులు శిక్షణ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు.
Samayam Telugu bus2
ఆర్టీసీ సమ్మె


అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పిటిషనర్ గోపాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.

మరోవైపు.. సెప్టెంబర్‌ నెల వేతనాలు చెల్లించాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. వాదనలు వినిపించేందుకు కొంత గడువు కావాలని ఆర్టీసీ తరపు న్యాయవాది కోరగా.. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే పలుమార్లు సమయం తీసుకున్నారని పిటిషనర్‌ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోసారి గడువు కోరవద్దని హైకోర్టు ధర్మాసనం ఆర్టీసీని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Also Read: పీసీసీ చీఫ్ పదవి నాదే.. పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకున్నా: కోమటిరెడ్డి

విధుల్లో చేరడానికి ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు బారులు తీరుతున్నారు. విధుల్లో చేర్చుకోవడానికి తమకు పైనుంచి ఆదేశాలు లేవని అధికారులు చెబుతుండటంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.