యాప్నగరం

అసెంబ్లీలో ఇకపై మట్టి కుండలు, గ్లాసులు

తెలంగాణ అసెంబ్లీ ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా మారింది. అసెంబ్లీలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు స్పీకర్ పోచారం తెలిపారు. ఇకపై పర్యావరణ హితమైన వస్తువులనే వాడతామని తెలిపారు.

Samayam Telugu 18 Nov 2019, 11:09 pm
శాసనసభలో మట్టి కుండలు, గ్లాసులు ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ పరిసరాలను ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తున్నామని వెల్లడించారు. ఇకపై పర్యావరణహితమైన వస్తువులనే వాడుతామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌ అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు.
Samayam Telugu ts assembly
తెలంగాణ అసెంబ్లీ


తెలంగాణకు హరితహారం నిర్వహణకు గ్రీన్‌ ఛాలెంజ్‌ అదనపు ఆకర్షణగా నిలిచిందని స్పీకర్ పోచారం పేర్కొన్నారు. దేశ, విదేశాల్లో ఎంతో మందికి సంతోష్‌ కుమార్‌ కృషి ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. తాను కూడా గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటినట్లు తెలిపారు.

Also Read: పాకిస్థాన్‌లో తెలుగు యువకుడి అరెస్టు.. వీడియో రిలీజ్

‘ఇకపై అసెంబ్లీలో ప్లాస్టిక్‌ వస్తువులు, బాటిళ్లను వినియోగించబోం. పర్యావరణహిత వస్తువులనే వాడుతాం. మట్టితో తయారైన నీటి కుండలు, గ్లాసులు ప్రవేశపెడుతున్నాం’ అని స్పీకర్ పోచారం తెలిపారు. హైదరాబాద్‌లో సోమవారం (నవంబర్ 18) ఆయన మీడియాతో మాట్లాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.