యాప్నగరం

Plastic Rice: రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం.. కాల్చితే నల్లబడిన బియ్యం

ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించిన పలువురుగ్రామస్థులు వాటిని కాల్చారు. దీంతో నల్లగా మారి.. ఒకదానికి ఒకటి అతుక్కుపోయింది. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు.

Samayam Telugu 13 Dec 2020, 8:23 am
ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు స్థానికులు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా హాజీపూర్‌ మండలంలోని వేంపల్లి రేషన్‌ దుకాణంలో చోటు చేసుకుంది. దుకాణంలో పలువురికి రేషన్‌బియ్యం సరఫరా చేయగా ప్లాస్టిక్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించి శనివారం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ప్లాస్టిక్‌ బియ్యం వచ్చినట్లు స్థానికులు తహసీల్దార్‌ జమీర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన సంఘటన స్థలాన్ని చేరుకుని బియ్యాన్ని పరిశీలించారు. అధికారుల ముందే ప్లాస్టిక్‌ బియ్యాన్ని పలువురు గ్రామస్థులు కాల్చారు. దీంతో బియ్యం నల్లబడి ఒకదానికొకటి అతుక్కుపోయినట్లు గుర్తించారు.
Samayam Telugu రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ బియ్యం


Read More
:హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో చిరుత కలకలం

రేషన్‌ దుకాణంలోని 138 బస్తాల్లో ప్లాస్టిక్‌ బియ్యం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతో వెంటనే వాటిని సీజ్‌ చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా రేషన్‌ పంపిణీ నిలిపివేయాలని ఆదేశించారు. బియ్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తామని, రుజువైతే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో పేర్కొన్నారు. అన్నంలోనూ ప్లాస్టిక్‌ బియ్యంగా తేలినట్లు ఎంపీటీసీ సభ్యుడు డేగబాపు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కల్తీ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, రేషన్‌దుకాణం డీలర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.