యాప్నగరం

తెలంగాణ బిల్లు విషయంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోండి: మోదీ

Rajyasabha: ‘ఆ బిల్లుకు వ్యతిరేకంగా కొంత మంది సభ్యులు వెల్‌లోకి వచ్చినా, తర్వాత అర్థం చేసుకున్నారు. సభ్యులంతా ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. పాత విషయాలను ప్రజలు అంత తొందరగా మర్చిపోరు.’

Samayam Telugu 7 Feb 2020, 8:50 am
ప్రధాని మోదీ గురువారం రాజ్యసభలో ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ అంశం గురించి ప్రస్తావించారు. విపక్ష నేతలు చేసిన విమర్శలకు ఆయన తెలంగాణ అంశాన్ని సభలో లేవనెత్తారు. పార్లమెంటులో చర్చించకుండా జమ్మూ కశ్మీర్ బిల్లును ఆమోదించారని కాంగ్రెస్ నేత ఆజాద్ విమర్శించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. ‘‘జమ్మూ కశ్మీర్ అంశంపై సభలో రోజు మొత్తం జరిగిన చర్చలను యావత్ దేశం వీక్షించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కొంత మంది సభ్యులు వెల్‌లోకి వచ్చినా, తర్వాత అర్థం చేసుకున్నారు. సభ్యులంతా ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. పాత విషయాలను ప్రజలు అంత తొందరగా మర్చిపోరు. తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు సభలో పరిస్థితి ఎలా ఉందో గుర్తు చేసుకోండి.’’ అని సమాధానమిచ్చారు.
Samayam Telugu modi in rajyasabha


Must Read: హాజీపూర్ వరుస హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు..

సభ తలుపులన్నీ మూసేసి, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపేశారు. చర్చకు అవకాశమే లేకుండా చేశారు. ఎలాంటి వాతావరణంలో తెలంగాణ బిల్లులు ఆమోదించారనేది ఎవరూ మర్చిపోరు. రాజకీయాల్లో సీనియర్ అయిన ఆజాద్ గారిని ఉద్దేశించి నేను ఈ విమర్శలు చేయడం లేదు. అందరూ వాస్తవాలేంటో గుర్తించాలి. దశాబ్దాల తర్వాత మీకు ఓ కొత్త రాష్ట్రం (తెలంగాణను) ఏర్పాటుచేసే అవకాశం దక్కింది.’’

Also Read: బీభత్సం: డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. అయినా గానీ!

‘‘ఉత్సాహపూరితంగా మీరు అందర్నీ కలుపుకొని ఆ పని పూర్తి చేసి ఉండొచ్చు. జమ్మూ కశ్మీర్ విభజన విషయంలో ఎవరెవర్ని సంప్రదించారని విపక్షాలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. కానీ, ఆనాడు కాంగ్రెస్ కనీసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్లను అడిగిందా? అడగకుండానే విభజన జరిగిపోయింది. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్‌సభలో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై సాగుతున్న నిరసన ప్రదర్శనలు భారత ప్రజాస్వామ్యానికి హాని చేస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా’’ అని ప్రధాని అన్నారు.

Also Read: మేడారం గద్దెపైకి చేరుకున్న సమ్మక్క.. అపురూప దృశ్యాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.